ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి జరుపుకోనున్న తెలంగాణ మంత్రి

by సూర్య | Tue, Jan 14, 2020, 08:38 AM

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ అగ్రనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఆయన ఏపీలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా అలవాటుగా వస్తున్న దీనిని ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నేడు భీమవరంలో జరిగే భోగి వేడుకల్లో, రేపు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. అలాగే, కోడి పందాల్లోనూ ఆయన సరదాగా పాల్గొంటారని ఆయన అనుచరులు తెలిపారు. మంత్రి రాక సందర్భంగా భీమవరంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM