by సూర్య | Mon, Jan 13, 2020, 07:15 PM
సీఏఏతో పాటు ఎన్ఆర్సీపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి విపక్ష పార్టీలు షాకిచ్చాయి. ఈ సమావేశానికి హాజరయ్యేది లేదని పలు పార్టీల అధినేతలు స్పష్టం చేశారు. మమతా బెనర్జీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాయవతి, శివసేనలు ఈ సమావేశానికి గైర్హాజయ్యారు. కాంగ్రెస్ నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకావడం లేదని నేతలు మొండిచేయి చూపారు. అయితే కీలక సమావేశానికి ప్రధాన పార్టీలు గైర్హాజరుపై సోనియాగాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అఖిలపక్ష సమావేశానికి కేవలం ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు, డీఎంకే, ఎస్పీ నేతలు మాత్రమే హాజరయ్యారు. మహరాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి శివసేన చివరి నిమిషంలో సమావేశానికి హాజరుకాకపోవడం కాంగ్రెస్ వర్గాలకు మింగుడు పడటం లేదు.
Latest News