by సూర్య | Mon, Jan 13, 2020, 04:29 PM
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ కూంబింగ్ నిర్వహించింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన స్థలం నుంచి 16 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Latest News