అమెరికా స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్

by సూర్య | Mon, Jan 13, 2020, 08:01 AM

ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోమారు దాడులకు తెగబడింది. బాగ్దాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ బలాద్ ఎయిర్‌ బేస్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. మొత్తం 8 రాకెట్లు తమ స్థావరాన్ని ఢీకొట్టినట్టు ఇరాక్ తెలిపింది. ఈ దాడుల్లో మొత్తం నలుగురు గాయపడ్డారు. ఇరాన్ సైనికాధికారిని అమెరికా హతమార్చడంతో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా అలాగే ఉన్నట్టు తాజా దాడితో స్పష్టమైంది. మరోవైపు, ఇరాన్‌ను అమెరికా హెచ్చరిస్తూనే ఉంది. తీరు మార్చుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ ఈ దాడికి పాల్పడడం గమనార్హం.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM