by సూర్య | Mon, Jan 13, 2020, 11:06 AM
రాజధాని రైతులు కొన్ని సమస్యలు చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసలు అసైనీలకు కాకుండా వారి నుంచి కొనుగోలు చేసిన తమకే భూములు దక్కేలా జీవో సవరించాలని కోరారు. రాజధాని రైతులకు సమస్యలుంటే వాటి పరిష్కరానికి యత్నిస్తామని అయన అన్నారు. హైపవర్ కమిటీ చివరి సమావేశమని చెప్పలేమని అయన అన్నారు. అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహిస్తామని అయన అన్నారు. ఉద్యోగుల తరలింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లాల అభివృద్దే మా ప్రభుత్వ అజెండా అని అన్నారు.
Latest News