కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

by సూర్య | Sun, Jan 12, 2020, 01:42 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బూతులు తిట్టారని భానుగుడి సెంటర్‌లో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టి అక్కడి నుంచి ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్టు చేయాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. ద్వారంపూడిలోని చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తల దాడి నుంచి జనసేన మహిళా కార్యకర్తలను కాపాడిన పోలీసులు వారిని దగ్గరలోని గుడిలోకి పంపారు. కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పవన్ కు తక్షణమే చంద్రశేఖర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఇదేం పైత్యం.. ఏ పార్టీకి ఓటేశారో చెబుతూ వీడియోలు, ఫోటో తీసుకున్నారు Tue, May 14, 2024, 09:23 PM
ఏపీలో ఓటు వేసేందుకు 900 కిమీ కష్టపడి రైల్లో వచ్చారు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లినా, అయ్యో పాపం Tue, May 14, 2024, 09:16 PM
ఈవీఎంలలో పోలైన ఓట్లు ఎన్నిరోజులు ఉంటాయో తెలుసా Tue, May 14, 2024, 09:12 PM
కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని భార్యతో కలిసి సందర్శించిన పవన్ కళ్యాణ్ Tue, May 14, 2024, 09:07 PM
ఏపీలో ఆగని దాడులు.. తాడిపత్రి, చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. సీన్‌లోకి చంద్రబాబు Tue, May 14, 2024, 09:02 PM