ప్రవాస భారతీయుడుకి నోబెల్ బహుమతి

by సూర్య | Mon, Oct 14, 2019, 09:59 PM

అమర్థ్యాసేన్‌ తర్వాత నోబెల్‌ పొందిన భారతీయుడిగా అభిజిత్‌ బెనెర్జీ ఘనత సాదించారు.అమెరికాలోని మసాచూసెట్స్‌యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్న అభిజిత్‌ బెనెర్జీ ఆర్థికశాస్త్రంలో హార్వార్డ్‌యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆర్థికశాస్త్రంలో విశేష సేవలని అందించినందుకు ఈ ఏడాదికి ముగ్గురికి నోబెల్ బహుమతి అందనుంది. రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ ఎంపిక చేసిన ముగ్గురిలో భారత్ నుండి అభిజిత్‌ బెనర్జీ ఉన్నాడు. ఇంకా పారిస్ కి చెందిన ఎస్తేర్‌ డుఫ్లో, అమెరికాకి చెందిన మైఖేల్‌ క్రెమేర్‌లు సంయుక్తంగా ఈ బహుమతికి ఎంపిక అయ్యారు. రెండు దశాబ్దాలగా ప్రపంచ పేదరికాన్ని తగ్గించడానికి వీరు ముగ్గురు చేసిన రూపకల్పనకి ఈ బహుమతి వరించింది. ప్రపంచ పేదరికంతో పోరాడే సామర్థ్యాన్ని  వీరి ప్రయోగాత్మక విధానం పెంచింది అని రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ తెలిపింది. ప్రైజ్‌మనీగా 9మిలియన్ల డాలర్లను నోబెల్‌ కమిటీ నుండి ఈ ముగ్గురు అందుకొనున్నారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM