ఆరోప‌ణ‌లు చేసిన మ‌హిళ‌నే పెళ్లాడిన న్యాయ‌మూర్తి

by సూర్య | Sun, Oct 13, 2019, 07:36 PM

  తనను చేసుకుంటానని చెప్పి నాలుగు సంవత్సరాలుగా తనపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడని  ఆరోప‌ణ‌లు చేసిన‌ మహిళ  నే ఓ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న ల‌క్నోలో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌ జిల్లా హాపూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా పని చేస్తున్న దినేష్ కుమార్ అనే వ్యక్తిపై ఓ మహిళ కొద్ది రోజులుగా లైంగిక ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారుల‌కు ఫిర్యాదు చేసింది. మీడియా ముందుకు వ‌చ్చింది. దీంతో ర‌చ్చ ర‌చ్చ‌గా మార‌టంతో ఆ న్యాయ మూర్తి అస‌లు ఆమెతో త‌న‌కు సంబంధ‌మే లేద‌ని ప్ర‌క‌టించినా ఫ‌లితం లేకుండా పోయింది.  అయితే వీరిరువురి రిలేషన్‌షిప్ గురించి వేరే ఎవరికీ తెలియదని ఈ విష‌య‌మై ప‌రిశీలించిన‌ ఖుషినగర్ జిల్లా మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ సింగ్ తెలిపారు. కానీ శుక్రవారం సాయంత్రం ఖుషినగర్‌లోని గాయత్రి గుడిలో  వీరి  వివాహం జరిగినట్లు ఓ జిల్లా స్థాయి అధికారి మీడియాకు వివ‌రిస్తూ ఓ ఫోటో విడుద‌ల చేసారు. 


 


 

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM