మోసాన్ని జీర్ణించుకోలేక.. మైనర్‌ బాలిక ఆత్మహత్య

by సూర్య | Sun, Oct 13, 2019, 03:21 PM

అనంతపురం జిల్లా గుంతకల్లు లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పేరుతో యువకుడు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక ఓ మైనర్‌ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంతకల్లులో సంచలనం రేకెత్తించింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పాత గుంతకల్లులోనే వాల్మీకి సర్కిల్‌లో నివాసముంటున్న మహాదేవి కుమార్తె గాయత్రి (17), దోనిముక్కల రోడ్డు గుట్టల వీధికి చెందిన నరేష్‌ అనే యువకుడు పరస్పరం ప్రేమించుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ పెద్దలకు తెలిపి వివాహానికి అంగీకరింపజేశారు. మరి కొన్ని నెలల్లో పెళ్లి చేయాలని ఇరువైపులా పెద్దలు భావించారు. ఇదే అదనుగా భావించిన నరేష్‌.. గాయత్రిని ఒప్పించి శారీర అవసరాలు తీర్చుకుంటూ వచ్చాడు. ఈ లోపు పెళ్లి ముహుర్తాలు తీసేందుకు పురోహితుడిని ఇరువైపులా కుటుంబసభ్యులు కలిసారు. ఇద్దరి జాతకాలు సరిపోవడం లేదని పురోహితుడు తెలపడంతో పెళ్లికి నరేష్, అతని తల్లి సిద్దమ్మ, సోదరి నాగమణి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గాయత్రి శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM