by సూర్య | Sun, Oct 13, 2019, 03:05 PM
కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రభుత్వం రైతు భరోసా పథకంలో అనేక నిబంధనలు పెడుతోందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. విత్తనాలు సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు కొండవీటి చాంతాడులా మారాయని, సలహాదారుల పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నారని తులసిరెడ్డి విమర్శించారు.
Latest News