by సూర్య | Sun, Oct 13, 2019, 02:41 PM
గుజరాత్: భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ఉదయం మర్యాద పూర్వకంగా కలిశారు. అధికారుల వివరాల మేరకు.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి.. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ గారిని గాంధీనగర్లోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఆమెతో కాసేపు మాట్లాడిన రాష్ట్రపతి ఆమె బాగోగులు తెలుసుకున్నారు. ప్రధాని తల్లిని చూస్తే తన తల్లిని చూసినట్లే ఉందని రాష్ట్రపతి ఈ సందర్భంగా అన్నట్లు సమాచారం. ఆమెతో మాట్లాడినంత సేపు తాను చాలా సంతోషానికి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ వయసులోనూ ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందనీ, ఇలాంటి వారు మనందరికీ ఆదర్శప్రాయులని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
Latest News