ప్రధాని తల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్రపతి

by సూర్య | Sun, Oct 13, 2019, 02:41 PM

గుజరాత్: భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ ఉదయం మర్యాద పూర్వకంగా కలిశారు. అధికారుల వివరాల మేరకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి.. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ గారిని గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఆమెతో కాసేపు మాట్లాడిన రాష్ట్రపతి ఆమె బాగోగులు తెలుసుకున్నారు. ప్రధాని తల్లిని చూస్తే తన తల్లిని చూసినట్లే ఉందని రాష్ట్రపతి ఈ సందర్భంగా అన్నట్లు సమాచారం. ఆమెతో మాట్లాడినంత సేపు తాను చాలా సంతోషానికి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ వయసులోనూ ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందనీ, ఇలాంటి వారు మనందరికీ ఆదర్శప్రాయులని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

Latest News

 
వడదెబ్బకు నెలటూరు గ్రామ వాసి మృతి Fri, May 03, 2024, 02:09 PM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 02:08 PM
దుంపలగట్టు ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 02:06 PM
బత్యాల సమక్షంలో వైకాపాను వీడి టిడిపిలో చేరిన 100 కుటుంబాలు Fri, May 03, 2024, 02:05 PM
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి Fri, May 03, 2024, 02:03 PM