by సూర్య | Sat, Oct 12, 2019, 10:38 PM
వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కేబినెట్లో మంత్రి పదవిని ఆశించాను అని ఆ పదవికి తాను అర్హుడినేనని.. కానీ కొన్ని రాజకీయ సమీకరణాలతోనే తనకు మంత్రి పదవి దక్కలేదని ఓ ఇంటర్వ్యూలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నెల్లూరు జిల్లాలో ఆనాడు ఓదార్పు యాత్ర ఎలా జరుగుతుందని.. అప్పుడు రాజకీయంగా పెద్ద, పెద్ద కుటుంబాలు అడ్డుపడితే.. ఈ నెల్లూరు జిల్లాలో నడిబొడ్డున ఓదార్పు యాత్ర జరిపి తీరుతామని చెప్పింది నేను, మంత్రి అనిల్కుమార్ యాదవ్’అన్నారు. కాబట్టి తాను మంత్రి పదవికి అర్హుడినేనని చెప్పారు. కానీ కొన్ని సమీకరణాలు ఉంటాయని.. జిల్లాలో ఇద్దరికి పదవులు ఇచ్చాక మూడో వారికి అవకాశం ఎలా వస్తుందన్నారు.ఇక తనకు టీడీపీ హయాంలో ఆఫర్లు వచ్చిన మాట వాస్తమేనని.. ఆ కారణంతో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారనడం సరికాదన్నారు కోటంరెడ్డి. తమ అధినేత పక్కన పెడితే.. ఎమ్మెల్యే టికెట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తనకు ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమేనని.. రూ.30కోట్లు డబ్బు.. రూ.500 కోట్లు వర్క్లు.. మొన్న ఎన్నికల్లో ఖర్చు.. ఇలా చాలా ఆఫర్లు వచ్చాయని చెప్పుకొచ్చారు.‘ఒక పార్టీలో గెలిచి.. ఆ పార్టీ అంటే ఇష్టం లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. స్పీకర్ దగ్గర ఆమోదింపచేసుకొని.. అప్పుడు పార్టీకి రాజీనామా చేయాలి. అలా కాకుండా ఒఖ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి.. ఏదో ఒక కారణంతో ఆ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని వేరే పార్టీలోకి వెళ్లడమనేది నీచమైన పని అన్నారు’కోటంరెడ్డి. ఇక ఎంపీడీవోతో వివాదంలో తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని.. అలాగే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
Latest News