సఫారీ టెయిలెండర్లు వికెట్ల కోసం చెమటోడ్చుతున్నా భారత బౌలర్లు

by సూర్య | Sat, Oct 12, 2019, 04:18 PM

పూణే టెస్టులో దక్షిణాఫ్రికా టాపార్డర్ ను కుప్పకూల్చిన టీమిండియా బౌలర్లు ఆ తర్వాత పట్టు విడిచారు. భారత బౌలర్ల ఉదాసీనతను చక్కగా ఉపయోగించుకున్న సఫారీ లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోర్లు సాధించడమే కాదు, ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ ఆతిథ్య జట్టు సహనానికి పరీక్షగా నిలిచారు. ఈ మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 601/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీలు 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చిక్కుల్లోపడ్డారు. ఈ దశలో భారత బౌలర్లు మరింత పట్టుబిగించి ఉంటే పర్యాటక జట్టు 100 పరుగుల లోపే ఫినిష్ అయ్యేది. కానీ, మనవాళ్ల 'ఔదార్యం' సఫారీలకు వరమైంది. ప్రస్తుతం సఫారీలు 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేశారు. క్రీజులో వెర్నాన్ (42) ఫిలాండర్, కేశవ్ మహరాజ్ (67) ఆడుతున్నారు. ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు.

Latest News

 
పల్నాడు జిల్లాలో నేడు కూడా 144 సెక్షన్ Fri, May 17, 2024, 12:43 PM
ఎవరెస్ట్, ఎండీఎచ్ మసాలాలపై నేపాల్ నిషేధం Fri, May 17, 2024, 12:40 PM
108 వాహనంలో కవలలు జననం Fri, May 17, 2024, 12:32 PM
యువతి అదృశ్యంపై కేసు నమోదు Fri, May 17, 2024, 12:31 PM
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాము Fri, May 17, 2024, 11:49 AM