by సూర్య | Sat, Oct 12, 2019, 12:43 PM
హర్యానాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కుమారి సెల్జాతో పాటు పలువురు సీనియర్ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు. సంకల్ప్ పత్ర పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీ, మహిళలకు రిజర్వేషన్ల వంటి అంశాలను చేర్చారు. అలాగే ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి మధ్య చదువుతున్న ఎస్సీ, వెనకబడిన తరగతుల విద్యార్థులకు ఏడాదికి రూ.12వేలు, 11,12 తరగతులు చదివేవారికి ఏడాదికి రూ.15వేల చొప్పున అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.
Latest News