by సూర్య | Sat, Oct 12, 2019, 09:03 AM
న్యూఢిల్లీ : ఎయిరిండియాకు ఇక ఫ్లూయల్ సరఫరా చేయలేమని చమురు సంస్థలు పేర్కొన్నాయి. అదే జరిగితే ఎయిరిండియా సర్వీసులు మరో వారం రోజుల్లో నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు 18వ తేదీ నుంచి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ను (ఏటీఎఫ్) సరఫరా చేయబోమని చమురు రంగ కంపెనీలు తేల్చి చెప్పాయి.ఇప్పటి వరుకు ఉన్న బకాయిలు చెల్లించే వరకూ ఏఐకి ఇంధనాన్ని అందించేది లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు తేల్చి చెప్పేశాయి. గడచిన 8 నెలలు నుంచి ఈ కంపెనీలకు ఏఐ బకాయిలు పేరుకుపోయాయి . చమురు కంపెనీలకు ఏఐ రూ. 5 వేల కోట్ల బకాయిపడింది.
Latest News