by సూర్య | Sat, Oct 12, 2019, 01:05 AM
మామల్లపురంలోని పంచ రథాల వద్ద సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశమైన ప్రధాని మోడీ, సరికొత్త తమిళ గెటప్లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోడీ. సంప్రదాయ దుస్తులు ధోవతి,చొక్కా ధరించిన ప్రధాని నరేంద్రమోడీ షోర్ ఆలయం గురించి జిన్పింగ్కు వివరించారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు తమిళ సంప్రదాయ వంటకాలు. తక్కళి రసం, అరచవిట్ట సాంబార్,కడాయ్ కుర్మా,కవనరసి హల్వా కూడిన రాత్రి భోజనానికి ప్రధాని ఆహ్వానించారు.
ఈ సమావేశానికి ముందు జిన్పింగ్కు ఘనస్వాగతం పలికేందుకు కేరళలో ప్రసిద్ధి చెందిందిన చెండమేళం డప్పుకళాకారులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇచ్చిన ప్రదర్శనని చైనా అధ్యక్షుడు ఆసక్తిగా పరిశీలించారు.
Latest News