by సూర్య | Sat, Oct 12, 2019, 12:58 AM
ఏపీలో నెలకోన్న ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోందని పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలపై ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజెందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వం మాత్రం 42వేల కోట్ల రుపాయాలను అప్పులను అప్పగించిందని దానిని తీర్చే ప్రయత్నం తాము చేస్తుంటే రాళ్లేస్తున్నారని మండి పడ్డారు. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాలో మాట్లాడుతూ వేల కోట్ల రుపాయాల అప్పులు చేసిన గత ప్రభుత్వం మాగురించి మాట్లాడుతుందా అంటూ మండిపడ్డారు.
తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే వేల కోట్ల రూపాయలు చెల్లించింది మినహా ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా తెచ్చిన అప్పులను ఇతర రంగాలకు బదీలీ చేసి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందని విమర్శలు చేశారు. విద్యుత్ రేట్లు తగ్గుతున్నాయని తెలిసినా, ఎక్కువ ధరలకు విద్యుత్ను కొనుగోలు చేసి, డిస్కంలకు ప్రభుత్వ ధనాన్ని కట్టబెట్టిన ఘనత చంద్రబాబుదని ఇక్కడే వేల కోట్లు నొక్కేసారన్న విషయం తెలుస్తోందని అన్నారు. దీని వల్లె తాము రీటెండరింగ్ పేరెత్తితేనే బాబు మండి పడుతున్నారని ఎద్దేవా చేసారు.
Latest News