by సూర్య | Fri, Oct 11, 2019, 02:22 PM
హైదరాబాద్: కర్నాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు 5 కోట్లు నగదును సీజ్ చేశారు. ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వరతో పాటు ఇతర నివాసాల్లో గురువారం ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో సుమారు 5 కోట్ల నగదు దొరికినట్లు ఇవాళ ఐటీ అధికారులు చెప్పారు. ఇవాళ కూడా మరో 25 ప్రాంతాల్లో ఐటీ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. గురువారం బెంగుళూరుతో పాటు తుమకూరులోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేసింది.
Latest News