మహాబలిపురం చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

by సూర్య | Fri, Oct 11, 2019, 01:07 PM

హైదరాబాద్: చెన్నై సమీపంలోని పురాతన పట్టణం మహాబలిపురానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తమిళనాడు మంత్రి కె.పాండ్యరాజన్‌ సాదర స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సాయంత్రం 4 గంటలకు జరిగే భేటీ నిమిత్తం ప్రధాన మంత్రి మహాబలిపురానికి చేరుకోనున్నారు.  మరోవైపు చైనా అధ్యక్షుడి పర్యటనకు వ్యతిరేకంగా టిబెటియన్‌లు ఆందోళన చేపట్టారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఐదుగురు టిబెటియన్‌లను అదేవిధంగా ఐటీసీ గ్రాండ్‌ హోటల్‌ వద్ద ధర్నాకు దిగిన మరో 8 మంది టిబెటియన్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గొప్ప ఆతిధ్య, సాంస్కృతిక నేపథ్యం గల తమిళనాడుకు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM