by సూర్య | Fri, Oct 11, 2019, 01:07 PM
హైదరాబాద్: చెన్నై సమీపంలోని పురాతన పట్టణం మహాబలిపురానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తమిళనాడు మంత్రి కె.పాండ్యరాజన్ సాదర స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సాయంత్రం 4 గంటలకు జరిగే భేటీ నిమిత్తం ప్రధాన మంత్రి మహాబలిపురానికి చేరుకోనున్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడి పర్యటనకు వ్యతిరేకంగా టిబెటియన్లు ఆందోళన చేపట్టారు. చెన్నై ఎయిర్పోర్టులో ఐదుగురు టిబెటియన్లను అదేవిధంగా ఐటీసీ గ్రాండ్ హోటల్ వద్ద ధర్నాకు దిగిన మరో 8 మంది టిబెటియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గొప్ప ఆతిధ్య, సాంస్కృతిక నేపథ్యం గల తమిళనాడుకు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
Latest News