by సూర్య | Fri, Oct 11, 2019, 01:01 PM
విశాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు ప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూసింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీకి వచ్చిన మహిళ విషయంలో డాక్టర్లు నిర్లక్యంగా వ్యవహరించడంతో శిశవు తల పగిలి మెదడు బయటకు వచ్చి వెంటనే శిశువు మృతి చెందింది. 9నెలల పాటు శిశువును కడుపులో మోసిన తల్లి రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టిస్తోంది. ఘటనపై ఆగ్రహించిన బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆందోళనకు దిగారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
Latest News