by సూర్య | Fri, Oct 11, 2019, 11:24 AM
న్యూఢిల్లి : ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) హైకోర్టును ఆశ్రయించింది. ఇ.డి. దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనున్నది. ఈ కేసులో చిదంబరానికి, అతని కుమారుడు కార్తీకి ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 5వ తేదీన ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని ఇ.డి. హైకోర్టులో సవాల్ చేసింది.
Latest News