యాత్రికులపై నుంచి దూసుకెళ్లిన బస్సు

by సూర్య | Fri, Oct 11, 2019, 11:28 AM

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లోని నరౌరా వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. రహదారి పక్కన నిద్రిస్తున్న యాత్రికులపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గంగానదిలో నరౌరా ఘాట్‌ వద్ద స్నానానికి వెళ్లిన వారికి ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును వదిలి డ్రైవర్ పరారయ్యాడు. బస్సులో వైష్ణోదేవి యాత్రకు వెళ్లి వస్తున్న భక్తులు ఉన్నారు.

Latest News

 
లోకం మాధవి ఆస్తుల విలువ తెలిస్తే షాకె Sat, Apr 20, 2024, 02:08 PM
అనకాపల్లి జిల్లాలో భారీగా వైసీపీలోకి చేరికలు Sat, Apr 20, 2024, 02:05 PM
బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు Sat, Apr 20, 2024, 02:03 PM
మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి Sat, Apr 20, 2024, 02:02 PM
అనకాపల్లి లో అడుగుపెట్టిన సీఎం జగన్ Sat, Apr 20, 2024, 02:01 PM