బొత్స రాజధాని వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తల ఆందోళన
by సూర్య |
Sun, Aug 25, 2019, 07:44 PM
రాజధాని మార్పుపై ప్రభుత్వంలో ఓ చర్చ జరుగుతోందని , T త్వరలో ఓ నిర్ణయం ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సొంతపార్టీలోనే కలకలం రేపుతున్నాయి.
ఆదివారం తుళ్ళూరు మండలం వెలగపూడిలో వైసీపీ కార్యకర్తలు బొత్స వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. . రాజధానిపై తప్పుడు ప్రకటనలు చేస్తే సహించేది లేదని, భూములు ఇచ్చిన రైతులు కుటుంబాలతో కలసి రోడ్డుపై బైఠాయించారు . సీఎం జగన్ రాజధానిపై తక్షణమే ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఐతే రాజధాని నిర్మాణంపై తన వ్యాఖ్యలను టీడీపీ, జనసేనలు, వారి అనుకూల మీడియా వక్రీకరించారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. . చెన్నై, ముంబయి... ఎప్పుడో కట్టిన రాజధానులనీ, వాటితో అమరావతికి పోలిక లేదని . ముంపునకు గురవుతుందని తెలిస్తే అక్కడ రాజధానిని నిర్మించేవారా? అని బొత్స ప్రశ్నించారు.
కానీ ముంపు ప్రాంతాలైతే ఏడాదికి మూడు పంటలు పాండే భూములని ఎలా ప్రచారం చేసారంటే మాత్రం స్పందించేందుకు మంత్రి నిరాకరిస్తున్నారని బొత్స పై రాజధాని రైతులు మండిపడుతున్నారు
Latest News