by సూర్య | Sun, Aug 25, 2019, 07:04 PM
ఆదివారం మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత్ భారత్ ను నిర్మద్దాం అని మోడీ పిలుపునిచ్చారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ విముక్త్ భారత్ ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటికే స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి మంచి ఫలితాలు సాధించామన్నారు. ఈసారి ప్లాస్టిక్ కు నో చెప్పి పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయితీలను, మున్సిపాలిటీలను, రాష్ట్ర ప్రభుత్వాలనూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా పనిచేయాలని కోరారు.
Latest News