by సూర్య | Sun, Aug 25, 2019, 02:18 PM
ఆధార్, ఈకేవైసీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆధార్ అప్డేట్ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. ఆధార్, కేవైసీ నమోదులో ఆందోళనలపై ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఆధార్ అప్డేట్ కోసం ఎలాంటి గడువు లేదన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్డేట్ చేయించుకోవచ్చన్నారు. ఈకేవైసీ అప్డేట్ చేయనంత మాత్రాన రేషన్ తిరస్కరించడం ఉండదన్నారు. ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో అక్కడే ఈకేవైసీ చేసుకోవచ్చన్నారు.
Latest News