by సూర్య | Sun, Aug 25, 2019, 09:58 AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిర్దేశిత దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 91,583 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 40,892 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.23 కోట్లు. తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున రూ.1.11 కోట్లు విరాళం అందజేశారు. అన్నదానం ట్రస్టుకు విరాళంను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి ప్రసాద్ అందజేశారు.
Latest News