by సూర్య | Sat, Aug 24, 2019, 03:44 PM
మరికొద్ది సేపట్లో శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని సర్వకోట, హిరమండలం, లక్ష్మీనరసుపేట, సీతంపేట, బూర్జ, పాలకొండ, నందిగం, టెక్కలి, పాతపట్నం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Latest News