by సూర్య | Sat, Aug 24, 2019, 10:31 AM
పతంజలి యోగ్ పీఠ్ వ్యవహారాలు చూసుకుంటున్న ఆచార్య బాలకృష్ణను ఎయిమ్స్ లో చేర్చారు. చాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను రిషికేష్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్చారు. తొలుత హరిద్వార్లోని ఓ ఆసుపత్రిలో చేర్చగా, ఆయనను పరీక్షించిన వైద్యులు ఎయిమ్స్కు రెఫర్ చేశారు. దీంతో శుక్రవారం సాయంత్రం 4:15 గంటలకు ఆయనను రిషికేశ్లోని ఎయిమ్స్లో చేర్చారు.
ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన స్పృహలో లేరని ఆసుపత్రి సూపరింటెండెంట్ బ్రహ్మప్రకాశ్ తెలిపారు. కొన్ని పరీక్షలు చేశామని, అన్నీ సాధారణంగానే ఉన్నాయని పేర్కొన్నారు. న్యూరో ఫిజీషియన్, కార్డియాలజిస్ట్ ఆయనను పరీక్షించినట్టు తెలిపారు. ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో బాలకృష్ణ ఉన్నారని బ్రహ్మప్రకాశ్ వివరించారు.
Latest News