by సూర్య | Thu, Aug 22, 2019, 06:53 PM
తిరువనంతపురం ఎంపీ , కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కి కోల్కతా హైకోర్టులో ఊరట లభించింది. వివాదాస్పద ‘హిందూ పాకిస్తాన్’ వ్యాఖ్యల కేసులో జారీ అయిన అరెస్టు వారెంటుపై కోల్కతా హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ రాజశేఖర్ మెంతా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.. సువిూద్ చౌదరి అనే లాయర్ వేసిన పిటిషన్ ఆధారంగా ఈ నెల 13న శశి ధరూర్పై ఓ సిటీ మెట్రోపాలిటన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతేడాది జూలైలో తిరువనంత పురంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ… 2019 లోకసేభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ వస్తే మన దేశం ‘హిందూ పాకిస్తాన్’ గా మారిపోతుందంటూ శశిథరూర్ వ్యాఖ్యనించిన చేసిన సంగతి తెలిసిందే.
Latest News