11సార్లు కత్తితో పొడిచి ఆపై గొంతుకోసి..

by సూర్య | Thu, Aug 22, 2019, 03:29 PM

భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న విషయం భార్యకు తెలియడంతో.. కట్టుకున్నవాడినే కడతేర్చిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. ముంబైలోని నల్లసొపర ప్రాంతంలో నివాసముంటున్న సునీల్, ప్రణలికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. సునీల్ వేరే మహిళతో కొన్నాళ్లుగా వివాహేతర బంధం సాగిస్తున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానమొచ్చి భార్య నిఘా పెట్టగా అసలు విషయం తెలిసింది. దీంతో భర్తపై పగ తీర్చుకోవాలని భావించిన ప్రణలి భర్త నిద్రిస్తున్న సమయంలో మంచినీళ్లు తాగే నెపంతో కిచెన్‌లోకి వెళ్లి కత్తి తెచ్చుకుంది.


నిద్రిస్తున్న భర్త కడుపులో 11 సార్లు పొడిచి, ఆ తర్వాత గొంతు కోసి హతమార్చింది. అయితే.. తన భర్తే పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు చెప్పింది. అయితే.. ఒక వ్యక్తి తనను తాను 11 సార్లు పొడుచుకోవడం సాధ్యం కాదని భావించిన పోలీసులు ప్రణలిని తమదైన శైలిలో విచారించగా భర్తను తానే చంపినట్లు అంగీకరించింది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM