కాళ్లపారాణి ఆరకముందే.. ఆత్మహత్య..

by సూర్య | Thu, Aug 22, 2019, 03:13 PM

కాళ్లపారాణి కూడా ఆరక ముందే నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లైన మరుసటి రోజే ఆత్మహత్య చేసుకోవటం స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన ఎం.కళ్యాణి(20)కి సోమవారం చందర్లపాడు మండలం కొడవటికల్లుకు చెందిన ఏసోబుతో వివాహమైంది. అదేరోజు అత్తగారింటికి వెళ్లిన ఆమె మంగళవారం భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. మధ్యాహ్నం ఇంటిలో ఫ్యానుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పైళ్లైన మరుసటి రోజే ఆత్మహత్య చేసుకోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తండ్రి రామయ్య కడుపు నొప్పి తాళలేక కూతురు ఆత్మహత్య చేసుకుందని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రామగణేష్‌ మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM