గోడదూకి మరీ... చిదంబరం అరెస్ట్

by సూర్య | Wed, Aug 21, 2019, 11:13 PM


నిన్నటి నుంచి  అజ్ఞాతంలో ఉన్న  కేంద్ర మాజీ మంత్రి చిదంబరం‌ను ఎట్టకేలకు సీబీఐ అరెస్ట్ చేసింది.  బుధవారం కాంగ్రెస్ కార్యాలయంలో  అకస్మాత్తుగా  ప్రత్యక్షమైన చిదంబరం కేవలం 3 నిముషాలు   మీడియా సమావేశం నిర్వహించి  తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పి, ఇతర ప్రశ్నల కు అవకాశం  ఇవ్వకుండా    నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. 
అయితే  ఏఐసీసీ కార్యాలయానికి చిదంబరం వచ్చిన విషయం తెలుసుకున్న సీబీఐ, ఈడీ బృందాలు ఆతనిని అరెస్ట్ చేసెందుకు అక్కడికి చేరుకున్న అప్పటికే చిదంబరం వెళ్లి పోవడంతో వెనుదిరిగారు. 
అనంతరం చిదంబరం నివాసానికి చేరుకున్న సీబీఐ, ఈడీ అధికారులను లోనికి రానిచ్చేందుకు గేటు తెరచేందుకు సెక్యూరిటీ నిరాకరించింది దీనితో అధికారులు గోడ దూకి లోపలికి వెళ్ళి  చిదంబరంతో  మాట్లాడి   అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం తీసుకెళ్లారు.
    


Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM