by సూర్య | Wed, Aug 21, 2019, 09:25 PM
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు, ఉత్ససర్లకు తిరుమంజనం చేయనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.00 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.
శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమల, కొలువు, పంచాంగ శ్రవణం, నిర్వహించనున్నారు. సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు గో పూజ మహోత్సవం, ఉట్లోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Latest News