by సూర్య | Tue, Jun 25, 2019, 08:12 AM
విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని ఒక గ్రామంలో యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు సోమవారం ఆలస్యంగా ఫిర్యాదు అందింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 18న పొలంలో ఆవులను మేపుతుండగా ఓ యువకుడు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అతడు మరొకరికి ఫోను చేసి రప్పించాడని, అతడు కూడా తనపై అత్యాచారం చేసినట్లు వివరించింది. వివస్త్రను చేసి వీడియో కూడా తీశారని తెలిపింది. ఈ ఘటనపై గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారని, అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు యువకులకు రూ.లక్ష జరిమానా విధించారని స్థానికులు చెబుతున్నారు. అయితే బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై గుర్ల పోలీసులను ఆశ్రయించింది. విజయనగరం గ్రామీణ పోలీసులు గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నామని సీఐ రమేష్ విలేకరులకు తెలిపారు.
Latest News