by సూర్య | Mon, Jun 24, 2019, 05:44 PM
ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు లేని వారు ఎవరూ ఉండకూడదనే లక్ష్యంతో ఈ ఉగాదికి 25లక్షల ఇంటి స్థలాలు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. సోమవారం ఉదయం ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటిస్థలం లేనివారు నిజమైన లబ్దిదారులను అధికారులు గుర్తించాలని.. పట్టాలు ఇచ్చేటప్పుడు ప్లాటు ఎక్కడుందో చూపించాలన్నారు. ఇందుకు గాను ఒక డిస్ట్రిక్ పోర్టల్ను ప్రారంభించాలని.. ప్రతి ఒక్క అంశాన్ని ఆ పోర్టల్లో పొందుపర్చాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు.
Latest News