by సూర్య | Mon, Jun 24, 2019, 05:41 PM
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎవరూ పార్టీని వీడటం లేదు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది అని తెలుగుదేశం మహిళా నేత అనురాధ స్పష్టం చేసారు. విజయవాడలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజావేదిక అక్రమ కట్టడమని, దానిని తక్షణమే కూల్చేస్తామని చెప్పడం ముఖ్యంత్రి జగన్ అవగాహనా రాహిత్యమని వ్యాఖ్యానించారు. కోర్టులో ఉన్న అంశంపై సీఎం వ్యాఖ్యలు సరికావని , అక్రమ కట్టడంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు? అని ఈ సందర్భంగా అనురాధ ప్రశ్నించారు.ఇదే ప్రదేశంలో స్వరూపానంద యాగం చేస్తే ఇద్దరు సీఎంలు వెళ్లి గంటలు.. గంటలు కూర్చున్నారు. వాళ్లకు ఎందుకు అనుమతి ఇచ్చారు..? సమన్యాయం పాటించరా?.
Latest News