by సూర్య | Mon, Jun 24, 2019, 02:16 PM
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల, చినరాజప్ప, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టిడిపి రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయింపును పార్టీ నేతలు ఖండించారు. టిడిపి పార్లమెంటరీ పార్టీని బిజేపిలో విలీనాన్ని సవన్వయ కమిటీ ఖండించింది. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక టిడిపి కార్యకర్తలపై దాడులు పెరిగాయని పేర్కొంది. దాడి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సమన్వయ కమిటీ తీర్మానించింది.
Latest News