by సూర్య | Mon, Jun 24, 2019, 01:52 PM
టీడీపీ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే నలుగురు ఎంపీలు ఆ పార్టీని వీడటంతో పాటు తాజాగా ఆ పార్టీ నేత అంబిక కృష్ణ కూడా వెలుతున్నట్టు సమాచారం. అయితే మరో నేత కూడా పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీలో వంగవీటి రాధా చేరుతున్నట్టు సమాచారం. సోమవారం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన వంగవీటి రాధ. ఇటీవలే వైసీపీ నుండి టీడీపీ లో చేరి ఎన్నికల ప్రచారంలో కూడా రాధ పాల్గొన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకొనున్న వంగవీటి రాధ.
Latest News