గ్రామ వాలంటీర్లకు ప్రారంభంలోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన జగన్

by సూర్య | Mon, Jun 24, 2019, 12:59 PM

ఏపీలోని 12 జిల్లాల్లో గ్రామ వాలంటీర్ల నియామకం కోసం నిన్న నోటిఫికేషన్ వెలువడింది. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ ను ప్రభుత్వం నియమించబోతోంది. మొత్తం 1,70,543 గ్రామ వాలంటీర్ల కోసం జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో, గ్రామ వాలంటీర్లు ఇంకా ఎంపిక కాకముందే వారికి ముఖ్యమంత్రి జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి లేకుండా చేసేందుకే ఒక్కో గ్రామ వాలంటీర్ కు నెలకు రూ. 5 వేల వేతనాన్ని చెల్లించబోతున్నామని అవినీతికి తావు లేకుండా పని చేయాలని చెప్పారు. గ్రామ వాలంటీర్ తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేస్తున్నామని జగన్ చెప్పారు. ప్రభుత్వ పథకాలను గ్రామ వాలంటీర్ల ద్వారా అమలు చేస్తామని తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM