చంద్రబాబు ఇంట్లో టీడీపీ నేతల అత్యవసర భేటీ!

by సూర్య | Mon, Jun 24, 2019, 12:49 PM

అమరావతిలోని ప్రజావేదికను ఎల్లుండి కూల్చివేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ భవనాన్ని అక్రమంగా, అవినీతితో నిర్మించారని సీఎం ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. అనంతరం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ కు డబ్బులు బాగా ఎక్కువ అయినట్లు ఉన్నాయని విమర్శించారు. అందుకే ప్రభుత్వ భవనాన్ని కూల్చుతామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భవనాలను కూల్చేసుకోవాలా? లేక వాడుకోవాలా? అన్నది సీఎం జగన్ నిర్ణయమని స్పష్టం చేశారు.

Latest News

 
అన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరు Tue, Apr 16, 2024, 02:49 PM
ఉత్తరాఖండ్‌- నేపాల్‌ సరిహద్దుల మూసివేత Tue, Apr 16, 2024, 02:04 PM
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు Tue, Apr 16, 2024, 01:30 PM
గురజాల జనసేన అభ్యర్ధి వైసీపీలోకి చేరిక Tue, Apr 16, 2024, 01:27 PM
ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిన నాయకుడు సీఎం జగన్ Tue, Apr 16, 2024, 01:26 PM