by సూర్య | Mon, Jun 24, 2019, 10:22 AM
ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో వెయ్యి పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. 10 విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 966 పాఠశాలలను మూసివేస్తామన్నారు. ఈ పాఠశాలల మూసివేతతో రాష్ట్రంలో టీచర్ల కొరతను అధిగమించడానికి ప్రభుత్వానికి వీలు చిక్కుతుంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులను సమీపంలోని ఇతర స్కూళ్లకు పంపుతారు. అలాగే టీచర్లను కూడా ఇతర స్కూళ్లకు బదిలీ చేస్తారని మంత్రి చెప్పారు.
Latest News