by సూర్య | Mon, Jun 24, 2019, 10:04 AM
జకార్తా: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. యందేనా ఐలాండ్లోని సోంలకీ సముద్ర తీరం వద్ద సంభవించిన ఈ భూకంపం తీవ్రత 7.5గా నమోదైంది. ఆదివారం రాత్రి 10.05 గంటల సమయంలో ఇది సంభవించింది. ఇండోనేసియా ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..యాంబన్ దక్షిణాన 321కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద భూమికి 214కి.మీ లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 30క్షణాల కంటే ఎక్కువ ఈ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడ సునామీ సంభవించే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం తెలిపింది. సునామీ పరిధిలోని ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News