సీఎం జగన్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి!

by సూర్య | Sun, Jun 23, 2019, 08:18 PM

టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి ఇవాళ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే టీటీడీని ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన సుబ్బారెడ్డి ఇదే అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే బోర్డు సభ్యుల నియామకంపై కూడా చర్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు శ్రీ తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలను బహూకరించారు. ఆయనను శాలువాతో సత్కరించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఆగమ శాస్త్రాలు, సంప్రదాయాలు, నియమాలను గౌరవిస్తూ టీటీడీ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతామని, టీటీడీ మీద వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ ఉంటుందని ఆయన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో పేర్కొన్నారు.


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM