బీజేపీ కేంద్ర కార్యాలయంలో కలకలం రేపిన బాంబు వార్త!

by సూర్య | Sat, Jun 22, 2019, 09:54 PM

ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో గల బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాంబు వార్త కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే  శనివారం ఉదయం బీజేపీ హెడ్ క్వార్టర్స్  కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తినుంచి  ఫోన్ కాల్ వచ్చింది.  అవతలి వ్యక్తి  బీజేపీ   కార్యాలయంలో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులకు దిగాడు. దీంతో కంగారుపడ్డ  కార్యాలయ సిబ్బంది వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఫోన్ కాల్ ఎవరు చేసారు? ఎక్కడినుంచి వచ్చింది? అనే  వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
ఈ ఫోన్  కర్ణాటకలోని  మైసూర్ నుంచి వచ్చినట్టుగా  గుర్తించారు. మరోవైపు కర్ణాటక పోలీసులకు కూడా సమాచారం అందించి ఫోన్  చేసిన వ్యక్తికి సంబంధించిన  వివరాలపై ఆరా తీస్తున్నారు.


 

Latest News

 
ఆధారాలు లేని రూ. 50 లక్షలు నగదు స్వాధీనం Mon, Apr 29, 2024, 12:42 PM
పేలిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ Mon, Apr 29, 2024, 12:40 PM
నేడు ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారం Mon, Apr 29, 2024, 12:38 PM
జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? Mon, Apr 29, 2024, 12:37 PM
నేడు చోడ‌వ‌రంలో సీఎం బహిరంగ సభ Mon, Apr 29, 2024, 12:36 PM