by సూర్య | Thu, Jun 20, 2019, 06:56 PM
ఓ భారీ విమానాన్ని సముద్రంపైకి తీసుకువచ్చి.. ఆ సముద్రపు నీళ్లలో ముంచేసిన ఘటన టర్కీకి వాయువ్య దిశలోని సారోస్ తీరంలో చోటు చేసుకుంది. ఎయిర్ బస్ ఎ- 330ను ఇబ్రైస్ పోర్టు నుంచి మోటారు బోట్ల సహాయంతో నాలుగు గంటల వ్యవధితో విమానాన్ని నీటిలో ముంచారు. ఇకపోతే ఈ విమానాన్ని స్కూబా డైవింగ్ టూరిజం అభివృద్ధి చెందడం కోసమే సముద్రంలోకి ముంచినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి భారీ యంత్రాలు సముద్రంలో స్కూబా డైవింగ్ చేయడానికి వచ్చే డ్రైవర్లను ఎంతగానో ఆకర్షిస్తాయని.. దాని ద్వారా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని వారు భావిస్తున్నారు.
Latest News