by సూర్య | Sat, Mar 23, 2019, 12:57 AM
ఏదైనా జనం దృష్టికి రానంతవరకే, లేదంటే ఆ విషయం చిరిగి చేటంతై వారి చెంతకు చేరితే అంతే గతి, అది రాజకీయమైనా, వ్యవహారమైనా. ఇదే జరిగింది శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విషయంలో ఆమధ్యఢిల్లీ విమానాశ్రయంలో ఎయిరిండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టివార్తల్లో నిలిచిన ఆయన వ్యవహారసైలి కుప్పలు తెప్పలుగా వచ్చిన వార్తాంశాలు పెద్దచేటే చేసాయి. ఈ క్రమంలోనే . తాజా లోక్సభ ఎన్నికలకోసం ఉస్మానాబాద్లో సొంత సర్వే నిర్వహించుకున్న శివసేన ఆయనకు జనంలో వచ్చిన మార్కులు చూసి బెంబేలెత్తి పోయింది. దీంతో టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు రవీంద్ర గైక్వాడ్ స్ధానంలో ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి ఈ సారి ఓమ్రాజె నింబల్కర్ను బరిలోకి దింపింది. శివసేన శుక్రవారం ప్రకటించిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 21 మంది అభ్యర్థుల జాబితాలో ఎయిర్పోర్టు వివాదం కారణంగానే రవీంద్ర గైక్వాడ్కు టికెట్ దక్కలేదన్న వాదన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. నోరా.... నా వీపుకు తేకే అనే సామిత ఇలాంటి వారి వల్లే వచ్చిందేమో?
Latest News