by సూర్య | Sat, Mar 23, 2019, 12:59 AM
నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు.ఈ మేరకు శుక్రవారం నగరి తహశీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపే చూస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు ధోరణి అవలంబించిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని, ఆయన పాలనలో నగరి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Latest News