క‌మ‌లాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న క్యారవాన్ కథనాలు

by సూర్య | Fri, Mar 22, 2019, 08:03 PM

ఎన్నికల వేళ క్యారవాన్ మ్యాగజైన్ కథనాలు దేశరాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలో కర్నాటక మాజీ సీఎం యెడ్యూరప్ప నుంచి రూ.1800 కోట్ల లంచం తీసుకున్నారంటూ బీజేపీ అగ్రనేతలపై అవినీతి బాంబుపేల్చింది కాంగ్రెస్.  'యెడ్డీ డైరీస్' పేరిట క్యారవాన్ ప్రచురించిన వార్తా కథనాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మీడియా ముందు ప్రదర్శిస్తూ,  యడ్డీ డైరీస్‌పై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే త‌న ద్వారా నిధులందాయంటూ కాంగ్రెస్  చేస్తున్న ఆరోపణలపై కర్నాటక మాజీ సీఎం యెడ్యూరప్ప తీవ్రంగా మండిపడ్డారు.  ఎన్నికల్లో ల‌బ్ది కోస‌మే కాంగ్రెస్ అర్థంలేని ఆరోపణలు చేస్తోందని, ఐటీ అధికారులు గతంలోనే ఈ విష‌య‌మై విచార‌ణ జ‌రిపి ఆ పత్రాలు నకిలీవని తేల్చినా  కాంగ్రెస్ నేతలు ఉద్దేశ పూర్వ‌కంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కాంగ్రెస్ త‌ర‌పున త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తాన‌ని యెడ్యుర‌ప్ప స్ప‌ష్టం చేసారు. 

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM