by సూర్య | Fri, Mar 22, 2019, 02:19 PM
సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు టీడీపీ అధినాయకత్వం మరోసారి టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేయడానికి ముందు ఉదయం పట్టణంలోని సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో తన భార్య వసుంధరతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకుని నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు, బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Latest News