by సూర్య | Fri, Mar 22, 2019, 11:15 AM
పశ్చిమబెంగాల్ : బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను కేంద్రమంత్రి జేపీ నడ్డా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సీనియర్లను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో.. పశ్చిమబెంగాల్ లో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇటీవలే బీజేపీలో చేరిన నిశిత్ ప్రమాణిక్ కు కూచ్ బెహర్ లోక్ సభ స్థానం నుంచి పార్టీ టికెట్ ఇచ్చింది. నిశిత్ ప్రమాణిక్ కు టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ..ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.
Latest News